లోక్‌సభ ఎన్నికలు: కరీంనగర్‌ ఎవరికి కంచుకోటగా మారుతోంది?

తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది కరీంనగర్. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం చుట్టూ మరోసారి ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 May 2024 5:48 AM GMT
Lok Sabha Elections, Karimnagar, left extremist

లోక్‌సభ ఎన్నికలు: కరీంనగర్‌ ఎవరికి కంచుకోటగా మారుతోంది? 

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది కరీంనగర్. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం చుట్టూ మరోసారి ఆసక్తికరమైన పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ వైపు ఓటర్లు మరోసారి చూస్తారా.. లేక ఇతర ఎంపికల వైపు మొగ్గు చూపుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ పార్లమెంట్ స్థానంలో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆయా రాజకీయ సిద్ధాంతాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సోషలిస్టు భావజాలం కలిగిన ప్రాంతం:

ఆర్థికంగా బలమైన ఈ పార్లమెంటు స్థానంలో ఓటర్లు స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఎన్నో మార్పులు కోరుకున్నారు. అలా రాజకీయంగా ఎన్నో వైవిధ్యాలు ఈ ప్రాంతంలో కలిగి ఉంది. బలమైన సోషలిస్టు భావజాలం కలిగిన నాయకులకు ప్రజలు ఇక్కడ అండగా నిలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఉదారవాద రాజకీయాలు కూడా ప్రజలను బాగా ఆకర్షించాయి. అలాగే ప్రాంతీయ రాజకీయాల కోణంలో కూడా ఈ ప్రాంత ప్రజలు బాగా ఆలోచించారు.

వామపక్షాల ప్రభావం

1970ల చివరి నుండి ఇక్కడ జరిగిన అన్ని ఎన్నికలలో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే.. వామపక్ష భావజాలం ఎక్కువగా ఉంది. పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సలిజానికి కేంద్రంగా ఉంది. సాయుధ బలగాలకు సంబంధించిన అనేక వర్గాలు గత దశాబ్దం మధ్యకాలం వరకు ఈ ప్రదేశంలో పట్టును సొంతం చేసుకున్నాయి. నియోజకవర్గంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం గత చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నక్సలైట్‌ వర్గాల ఆధిక్యత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీకి పట్టుదొరికింది.

కరీంనగర్‌లో పుంజుకున్న బీజేపీ:

1998, 1999 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోవడం విశేషం. రెండు దశాబ్దాల తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన బి వినోద్ కుమార్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచల రాజేందర్ రావుపై పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది.

కాంగ్రెస్ పోటీకి దింపింది ఎవరినంటే?

కాంట్రాక్టర్ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు 2009 సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు ఇప్పుడు ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ సెగ్మెంట్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి మద్దతు ఇస్తున్నారు.

2016లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించడంతో కరీంనగర్‌ను ఐదు జిల్లాలుగా విభజించారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది: కరీంనగర్, చొప్పదండి (SC), మానకొండూర్ (SC), హుజూరాబాద్ (కరీంనగర్ జిల్లా), వేములవాడ, సిరిసిల్ల (సిరిసిల్ల-రాజన్న జిల్లా), హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా). 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, హుస్నాబాద్‌లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా కరీంనగర్‌, సిరిసిల్ల, హుజూరాబాద్‌లలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అయితే బీజేపీకి పార్లమెంట్ స్థానం పరంగా మంచి అవకాశం ఉందని మాత్రం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి:

నియోజకవర్గంలో దాదాపు 17,91,970 మంది ఓటర్లు ఉండగా అందులో 9,16,820 మంది మహిళా ఓటర్లు, 8,75,048 మంది పురుషులు ఉన్నారు. మైనారిటీలలో 10 నుండి 12 శాతం ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల ఫలితాలను సహకార సంఘాలు ప్రభావితం చేయగలవు. ఈ సహకార సంఘాలలో పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను పొందేందుకు పలు హామీలను కురిపిస్తూ ఉన్నాయి.

Next Story