వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?

గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్‌లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

By Medi Samrat  Published on  7 May 2024 5:00 AM GMT
వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?

గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్‌లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చే సమయానికి ఆ మహిళ భర్త ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం నుంచి పరారీలో ఉన్న బాధితురాలి భర్త, ఆమె అత్త ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని, అతని భార్య, తల్లితో కలిసి చాలా కాలంగా స్టాఫ్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. మహిళ, ఆమె భర్త తరచూ గొడవలు పడేవారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. గొడవ తర్వాత భార్యను హత్య చేసి తల్లితో కలిసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం అన్వేషణ సాగుతోంది. మహిళ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. "మేము ఇరుగు పొరుగువారితో మాట్లాడాము.. ఆ వ్యక్తిని, అతని తల్లిని గుర్తించి అరెస్టు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసాము.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

Next Story